గిరిజనుల ఆదర్శపురుషుడు సంత్ సేవాలాల్ మహారాజ్: సోమిరెడ్డి

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి గిరిజన సంక్షేమానికి ₹1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ 16 కోట్ల మంది గిరిజనుల ఆరాధ్య దైవం, ఆదర్శపురుషుడని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. గతంలో గిరిజనుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయని,…

Read More

చివరి రోజు హోరెత్తిన కాంగ్రెస్ ప్రచారం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం…. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని బచ్చుగూడెం, ఐనోల్‌, రామేశ్వరంబండ, పెద్ద కంజర్ల, చిన్న కంజర్లలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా…

Read More
somireddy

సోమిరెడ్డి ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఎన్నికల ప్రచార సభ

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ… కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు రెట్టింపు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను నట్టేట ముంచుతోందని తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు…

Read More
GMR

గూడెం దారేటు?

బీఆర్ఎస్‌ పార్టీ సమావేశాలు రీ-ఎంట్రీకి సంకేతాలా..?గూడెం అధికారంగా ఎప్పుడు కండువా కప్పుకుంటారు? సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో మరోసారి గూడెం పేరు చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ఆయన రాజకీయ అడుగులు మాత్రం బీఆర్ఎస్ వైపే సాగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిత్యం బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొనడం, హరీష్ రావు శిష్యుడిగా గుర్తింపు ఉండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఇటీవల…

Read More

వెంటనే స్పందించి పాఠశాలకు వసతులు కల్పించాలి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న కేసీఆర్ నగర్‌లో ఇప్పటికీ పాఠశాల భవనం లేకపోవడం ఆశ్చర్యకరమని వారు అంటున్నారు. సరైన భవనం, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే స్పందించి పాఠశాలకు అవసరమైన మౌలిక…

Read More

రామేశ్వరం బండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం….

ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ ప్రాంతంలో 6, 7, 9 వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం…

Read More

అభివృద్ధే అజెండా.. ఇస్నాపూర్‌లో బీఆర్ఎస్ (BRS) ప్రచారం

పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్‌కుల్, లక్డారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాణిక్ రెడ్డి,…

Read More

భవిష్యత్తు తరం కోసం అంగన్వాడీ కేంద్రం అవసరం

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌ ఫేస్ -02లో తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. సుమారు 15 వేల కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల పోషణ, గర్భిణీలు మరియు బాలింతలకు అవసరమైన సేవలు అందించేందుకు అంగన్వాడీ కేంద్రం ఎంతో కీలకమని పేర్కొంటూ, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్‌లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని…

Read More

తెలంగాణలో ‘కామన్ బిల్’కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచే దిశగా ‘కామన్ బిల్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలపై అదనపు భారం మోపకుండా, పాలనను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. ఈ కొత్త విధానాన్ని తొలి దశలో GHMC పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అమలవుతున్న విధానాన్ని అనుసరిస్తూ, నీటి బిల్లు, విద్యుత్ బిల్లు,…

Read More
sundar pichai at India AI Impact summit

Tech giant Sundar Pichai to deliver a speech on the future of AI

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు అంతర్జాతీయ ప్రాధాన్యం మరింత పెరిగింది. గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వక్తగా ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ సాంకేతిక దిశలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై ఆయన ప్రసంగం ఉండనుంది. ఈ సమ్మిట్‌లో ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యా రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. భారత్‌లో AI వినియోగం ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ…

Read More