Commercial and Social Facilities Made Accessible to the Public

ప్రజలకు అందుబాటులోకి వాణిజ్య, సామాజిక సదుపాయాలురామచంద్రపురం పటాన్‌చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్‌లో రూ.10 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5.77 కోట్లతో నిర్మించిన 104 దుకాణాల బజార్, రూ.2.47 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించగా, రూ.1.20 కోట్లతో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్, మాజీ ప్రోటెం…

Read More

Hyderabad |CP Sajjanar  : నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రావొద్దు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈరోజు నుమాయిష్ (ఎగ్జిబిషన్) సందర్శనను వాయిదా వేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు ఎగ్జిబిషన్‌కు రావద్దని సీపీ సూచించారు. ట్రాఫిక్‌ను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

Read More

గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్

గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీపై విద్యుత్ బకాయిల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిలుగా ఉన్న మొత్తంలో మూడు వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం రూ.118 కోట్ల బకాయిలపై కఠినంగా స్పందించిన హైకోర్టు, గడువు లోపు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఆగని ప్రమాదాలు..మౌనంగా రవాణా శాఖ

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరిమెళ్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న AR BCVR ట్రావెల్స్‌కు చెందిన బస్సు, టైరు అకస్మాత్తుగా పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్‌, లారీ క్లీనర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే…

Read More

నేడే లాస్ట్ డేట్…
దేశసేవతో పాటు ఉన్నత విద్య..
నేవీ నుంచి అరుదైన అవకాశం…!

నేడే లాస్ట్ డేట్…దేశసేవతో పాటు ఉన్నత విద్య..నేవీ నుంచి అరుదైన అవకాశం…! భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మక 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒకవైపు గౌరవప్రదమైన నేవీ ఆఫీసర్ ఉద్యోగం, మరోవైపు ఉచిత బీటెక్ డిగ్రీ అందించనున్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి, JEE మెయిన్స్ ర్యాంక్ కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 44 ఆఫీసర్ పోస్టులు…

Read More