Mallanna Jathara Celebrated with Devotion in Pedda Kanjarla Village

Patancheru మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన తోట మల్లన్న, ఇంద్రేశం మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి హాజరయ్యారు. మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా వస్తున్న ఈ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని అభివర్ణించారు. ఇలాంటి పండుగలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందిస్తాయని…

Read More

Grand Republic Day celebrations held at KCR Nagar

తెల్లాపూర్ కార్పొరేషన్ కేసీఆర్ నగర్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నగర్‌లోని మెయిన్ గేట్, ఆటో యూనియన్ మరియు వివిధ బ్లాక్స్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మల్లేపల్లి సోమిరెడ్డి మాట్లాడుతూ… 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక…

Read More

Hyderabad |CP Sajjanar  : నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రావొద్దు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈరోజు నుమాయిష్ (ఎగ్జిబిషన్) సందర్శనను వాయిదా వేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలు ఎగ్జిబిషన్‌కు రావద్దని సీపీ సూచించారు. ట్రాఫిక్‌ను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

Read More

గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్

గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీపై విద్యుత్ బకాయిల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు బకాయిలుగా ఉన్న మొత్తంలో మూడు వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం రూ.118 కోట్ల బకాయిలపై కఠినంగా స్పందించిన హైకోర్టు, గడువు లోపు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఆగని ప్రమాదాలు..మౌనంగా రవాణా శాఖ

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరిమెళ్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న AR BCVR ట్రావెల్స్‌కు చెందిన బస్సు, టైరు అకస్మాత్తుగా పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్‌, లారీ క్లీనర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే…

Read More