Published on: January 26, 2026 at 10:40 PM

Patancheru మండల పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన తోట మల్లన్న, ఇంద్రేశం మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య రెడ్డి హాజరయ్యారు. మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా వస్తున్న ఈ జాతరలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని అభివర్ణించారు. ఇలాంటి పండుగలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను, ప్రేమానురాగాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

