ప్రజలకు అందుబాటులోకి వాణిజ్య, సామాజిక సదుపాయాలు రామచంద్రపురం
పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్లో రూ.10 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5.77 కోట్లతో నిర్మించిన 104 దుకాణాల బజార్, రూ.2.47 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ను ప్రారంభించగా, రూ.1.20 కోట్లతో కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్, మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ రెడ్డి, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Inaugurated developmental works worth ₹9.4 Crores in Bharathi Nagar Division today, bringing much-needed infrastructure and facilities closer to our people! • Inaugurated Multipurpose Function Hall at Bombay Colony (beside Basthi Dawakhana) – ₹2.47 Cr • Inaugurated Model… pic.twitter.com/h7CCSZ7AqV
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@gadwalvijayainc) January 24, 2026